హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా రెడ్బుల్ క్యాంపస్ క్రికెట్ టోర్నమెంట్లో టీకేఆర్ కళాశాల జట్టు సత్తాచాటింది. భువనేశ్వర్కు చెందిన ఎమ్ఎస్ఎన్ఎల్సీ కళాశాలతో జరిగిన పోరులో ప్రణీత్ రాజ్ (3/19) రాణించడంతో టీకేఆర్ జట్టు గెలుపొందింది. మొహాలీ వేదికగా జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన టీకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. మందాడి రెడ్డి (37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మిర్యాల ప్రత్యూశ్ (35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు. అనంతరం లక్ష్యఛేదనలో ప్రణీత్ ధాటికి ఎమ్ఎస్ఎన్ఎల్సీ టీమ్ 19.1 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రణీత్ మూడు వికెట్లు పడగొట్టగా.. హితేశ్ యాదవ్, నీలేశ్ చెరో రెండు వికెట్లు తీశారు.