తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 130.29 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏ నెలలో కూడా ఇంత ఆదాయం హుండీ ద్వారా సమకూరలేదని స్పష్టం చేశారు.
ఒక్క మే నెలలో 22,62,000 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారని, 1.86 కోట్ల లడ్డూల విక్రయం జరిగిందని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి తెలిపారు. ఇటీవలి రోజుల్లో రోజుకు రూ. 4 కోట్ల చొప్పున ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. భక్తులు అధికంగా తరలివచ్చిన రోజుల్లో ఈ ఆదాయం రూ. 5 కోట్లు కూడా చేరిందన్నారు.