హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు ఒకటిన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ శనివారం వెల్లడించింది. దాదాపు 600 టికెట్లను అందుబాటులో ఉంచనున్నది. టిక్కెట్ ధర ఒకరికి రూ.2,500గా నిర్ణయించింది.
పవిత్రోత్సవాలు ఆగస్టు 8 నుంచి 10వ వరకు శ్రీవారి ఆలయంలో జరుగనున్నాయి. వివరాలకు www.tirumala.org, www.tirupatibalaji.gov.in చూడొచ్చు.