తిరుమల : సిరులతల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వాహన మండపంలో ఏకాంతంగా జరుగనున్నాయి. ఇందు కోసం నవంబర్ 29న ఉదయం లక్షకుంకుమార్చన, సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు.
30న ఉదయం ధ్వజారోహణం, రాత్రి చిన్నశేష వాహన సేవ
01న ఉదయం పెద్దశేష వాహన సేవ, రాత్రి హంసవాహన సేవ
02న ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి సింహవాహన సేవ
03న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంతవాహన సేవ
04న ఉదయం పల్లకీ ఉత్సవం, సాయంత్రం వసంతోత్సవం, రాత్రి గజవాహన సేవ
05న ఉదయం సర్వభూపాలన వాహనం, సాయంత్రం స్వర్ణ రథం బుదులుగా సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనసేవ
06న ఉదయం సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహన సేవ
07న ఉదయం రథోత్సవం బదులు సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వ వాహన సేవ
08న ఉదయం పంచమితీర్థం, రాత్రి ధ్వజావరోహణం