మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 20 : ఆంగ్లేయులను ఎదిరించిన వీరుడు టిప్పు సుల్తాన్ అని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం మహబూబ్నగర్లోని అల్మాస్ ఫంక్షన్ హాలులో ‘స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. టిప్పు సుల్తాన్ 17 ఏండ్ల వయస్సులోనే తెల్లదొరలతో పోరాటం చేశారని గుర్తుచేశారు. నాలుగు సార్లు బ్రిటిష్ సైన్యంతో పోరాటం చేసిన గొప్ప వీరుడని కొనియాడారు. ఎందరో ముస్లింలు స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించారన్నారు.