జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. రేగొండ మండలం చెంచుపల్లి శివారులో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారు పులి అడుగులను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు పులి అడుగుల నమూనాను సేకరిస్తున్నారు.
కాగా, ఎవరు కూడా ఒంటరిగా ప్రయాణం చేయొద్దని, రాత్రిపూట అవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు.