హైదరాబాద్ : పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. చిల్లర సమస్యను పరిష్కరించేందుకు ఛార్జీలను రౌండప్ చేసింది. ప్రయాణికులు, కండక్టర్ల బాధలను దృష్టిలో ఉంచుకొని, నేటి నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది టీఎస్ ఆర్టీసీ. చిల్లర సమస్య కారణంగా హైదరాబాద్ నగరంలో ఛార్జీల రౌండప్ను టీఎస్ ఆర్టీసీ రెండేండ్ల క్రితమే అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
పల్లె వెలుగు బస్సుల్లో రూ. 12 ఛార్జీ ఉన్న చోట టికెట్ ధరను రూ. 10గా రౌండప్ చేశారు. రూ. 13, రూ. 14 ఉన్న టిచెట్ ఛార్జీని రూ. 15గా రౌండప్ చేశారు. 80 కిలోమీటర్ల దూరానికి రూ. 67గా ఉన్న ఛార్జీని రూ. 65గా నిర్ధారించారు. టోల్ ప్లాజాల వద్ద ఆర్డినరీకి రూ. 1, హైటెక్, ఏసీ బస్సులకు రూ. 2 వసూలు చేయనున్నారు.