జైపూర్ : రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో వాహనం బోల్తాపడి.. ముగ్గురు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. స్టేషన్హౌస్ ఆఫీసర్ విక్రమ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీయాసర్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. వాహనం బోల్తాపడగా.. మంటలు చెలరేగాయి. గాయపడిన ఐదుగురు సైనికులు వాహనం బయటకు రాగా.. ముగ్గురు అందులోనే చిక్కుకుపోయారు. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.