రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో మావోయిస్టుల దుశ్చర్య. కడేనార్-కన్హర్గావ్ మధ్య ప్రయాణిస్తున్న జవాన్ల బస్సును లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీ బాంబు దాడికి పాల్పడ్డారు. బస్సులో మొత్తం 27 మంది డిస్టిక్ట్ రిజర్వ్ గార్డు(డీఆర్జీ) సిబ్బంది ఉన్నారు. పేలుడు దాటికి వీరిలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగినట్లు ఛత్తీస్గఢ్ డీజీపీ డీఎం అవాస్తీ తెలిపారు. 45వ బెటాలియన్కు చెందిన ఐటీబీపీ సిబ్బంది క్షతగాత్రులను తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సంబంధిత ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టినట్లు మావోయిస్టుల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.