న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల అంశంపై విస్తృత స్థాయిలో చర్చించి, విచారించాల్సిన అవసరమున్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు వెల్లడించింది.
ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.