రంగారెడ్డి: జిల్లాలోని షాద్నగర్ (Shadnagar) మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటుచేసుకున్నది. మున్సిపాలిటీలోని సోలిపూర్లో ఉన్న ఓ నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. గ్రామానికి చెందిన అక్షిత్ గౌడ్, ఫరీద్, పర్వీన్.. చేపలు పట్టడానికి నీటిగుంటలోకి దిగారు. అది లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు అందులో మునిగి చనిపోయారు. గుర్తించిన స్థానికులు వారి మృతదేహాలను బయటకు తీశారు. వారంతా పదేండ్లలోపు వారేనని చెప్పారు. అప్పటివరకు కళ్లముందున్న చిన్నారులు విగజీవులుగా మారడంతో వారి తల్లదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.