హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ శివారులో వేగంగా దూసుకొచ్చిన కారు.. హార్వెస్టర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరించారు. మృతులను చొప్పదండికి చెందిన అక్షయ్, శిగా గుర్తించారు.
మరో ఘటనలో హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్ వద్ద ఓ కారు అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి మరణించాడు. అప్పటికీ ఆగని కారు.. ఇంట్లోకి దూసుకెళ్లడంతో ప్రహరీ గోడ కూలిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతుడిని కుంట్లూరుకు చెందిన రఘురాం (30)గా గుర్తించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.