హైదరాబాద్ : రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తల్లీ కొడుకులు, ఖమ్మం జిల్లాలో ఇంటర్ విద్యార్థి పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందాని గ్రామంలో సెందె నాకు బాయి(35), సెండెన్ విష్ణు(6)గా మృతి చెందారు. పొలం పనుల్లో ఉండగా.. ఒక్కసారిగా పిడుగుపడడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలో కోల్పోయారు.
ఇదే ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారంలో పిడుగుపాటుకు ఇంటర్ విద్యార్థి వేణు మృతి చెందాడు. పొలంలో పని చేస్తున్న సమయంలో వేణు ప్రాణాలు కోల్పోయాడు. పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాదం అలుముకున్నది.