వాషింగ్టన్, ఆగస్టు 6: అమెరికా రాజధాని వాషింగ్టన్లోని వైట్హౌస్ సమీపంలో పిడుగు పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. వైట్హౌస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న లఫాయెట్ పార్క్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలబడుతామని హామీ ఇచ్చారు.