ఆదిలాబాద్ : జిల్లాలో పిడుగులు శనివారం బీభత్సం సృష్టించాయి. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. బజార్హత్నూర్ మండలం బూరుగుపల్లిలో పిడుగు పడడంతో గరన్ సింగ్, ఆశా బాయి మృతి చెందారు. తాంసీ మండలం బండల్నాగపూర్లో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో రాథోడ్ దీపాలి (18) అక్కడికక్కడే మృత్యువాతపడింది. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. జైనథ్ మండలం సాంగ్వీలో మేకల మందపై పిడుగు పడడంతో 16 మూగజీవాలు మృతి చెందాయి.