హైదరాబాద్: నగర శివార్లలోని పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫల యత్నం జరిగింది. పటాన్చెరులోని గోకుల్నగర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో (SBI ATM) దుండగులు నగదు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎం మెషిన్ను కట్ చేయడంతో అందులో ఉన్న నోట్లు కాలిపోయాయి.
పెట్రోలింగ్లో భాగంగా పోలీసులు అటువైపు రావడంతో సైరన్ విని దుండగులు గ్యాస్ కట్టర్ను అక్కడే వదిలి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.