ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత నవీన్ పొలిశెట్టి చేసిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన జాతిరత్నాలు ఫన్ ఎంటర్ టైనర్ గా అలరిస్తుంది. ఈ మూవీలో వినోదంతోపాటు సర్ప్రైజ్ ఎంట్రీలు కూడా ఉన్నాయి. స్టార్ హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, కీర్తిసురేశ్ గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారు.
ఫస్టాఫ్ లో విజయ్ దేవరకొండ కనిపించగా..సెకండాఫ్లో కీర్తిసురేశ్ కనిపిస్తుంది. సినిమా మధ్యలో ఇలా ఇద్దరు సర్ప్రైజింగ్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వు కనిపించడం గమనించవచ్చు. నిర్మాత నాగ్ అశ్విన్కు విజయ్, కీర్తిసురేశ్ మంచి స్నేహితులు కావడంతో సినిమాలో మెరిసి ఆడియెన్స్ లో జోష్ నింపుతున్నారు. ఏడాది తర్వాత విజయ్దేవరకొండను సిల్వర్ స్క్రీన్ పై చూడటంతో అభిమానులు ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.