జోగులాంబ గద్వాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి ఓ వ్యక్తి మృతి
చెందగా మరొకరు తీవ్రంగా గాయప్డారు. ఈ విషాదకర సంఘటన మల్దకల్ మండలం చెర్ల గార్లపాడు గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నవీన్ (25) అనే యువకుడు పిడుగుపడి మృతి చెందాడు.
నర్సింలు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య కూతురు ఉంది. కాగా, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మల్దకల్ తాసిల్దార్ శ్యామ్ తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న తాసిల్దార్ పంచనామా నిర్వహించి నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Suryapet | పట్టపగలే చుక్కలు చూపిస్తున్న రైతులు..రూటు మార్చిన ‘బండి’
కోచ్గా రాహుల్ ద్రావిడ్ తొలి రోజు.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ‘భూదాన్ పోచంపల్లి’