నల్లగొండ : దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన 17 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించలేని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు.
మిగతా రాష్టాల్లోని ప్రజలు కూడా ఆయా రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అమలు చేయాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని, ఇప్పుడు దేశం మొత్తం ఆయన నాయకత్వం వైపు చూస్తుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.