కమలాపూర్ : హనుమకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గౌడ కులస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్థులంతా ఏకగ్రీవంగా తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.