మహబూబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోడలిని మామ పట్టపగలే అతి కిరాతకంగా హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల కథనం మేరకు.. కురవి మండలం సోమ్లా తండాకు చెందిన భూక్య రజిత (35)ను ఆమె మామ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు
సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కుటుంబ కలహాలే హత్యకు కారణమని స్థానికులు అనుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.