రంగారెడ్డి : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఇర్కుల యాదయ్యకు రూ.60వేలు, మక్కపల్లి శేఖర్కు రూ.38వేలు, ఉడుతల శ్రీకాంత్కు రూ.30వేల సీఎం సహాయనిధి చెక్కులను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపదలో ఉన్న ఎంతోమంది నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు.అనారోగ్య సమస్యలతోనైనా దవాఖానలో చికిత్స చేయించుకున్న వెంటనే సీఎం సహాయనిధికి ధరఖాస్తు చేసుకుని లబ్ధిపొందాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.