జోగులాంబ గద్వాల : నిరు పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందన్నదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో గద్వాల మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విపత్తు సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపడం లేదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా అన్ని రకాల పరీక్షలు చేస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు మాజీద్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, సర్పంచ్ వాసు, తదితరులు పాల్గొన్నారు.