Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిగాయి. నవరాత్రులలో తొలి రోజు సోమవారం ఆది దంపతుల దర్శనాల కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధుల్లో సందడి నెలకొంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామిఅమ్మవార్ల దర్శనాలకు ఎటువంటి ఇబ్బందులు అన్ని ఏర్పాట్లను చేసినట్లు దేవస్థానం పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు.
మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ దేవస్థానం ఈవో లవన్న దంపతులు దీపాలంకరణసేవ నిర్వహించారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మ వార్లను ఊయలలో వేంచేబు చేసి వేదపండితులు మహా సంకల్పం పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు దీపార్చన చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల వెండి పల్లకి సేవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.