అమరావతి : విజయవాడలో ఓ వృద్ధ దంపతుల ఆత్మహత్యను హత్యగా పోలీసులు నిర్దారించారు. ఇటీవల నగరంలో వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ దంపతులు మద్యానికి బానిసై చనిపోయి ఉండవచ్చని స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించా రు. అయితే దంపతుల చిన్నల్లుడు రంజాన్ను విచారించిన పోలీసులు అసలు విషయాన్ని తెలుసుకుని అవాక్కయ్యారు. ఇద్దరికి మద్యం తాగడం అలవాటు ఉండడంతో ఇదే అలుసుగా తీసుకున్న చిన్నల్లుడు మద్యంలో స్పిరిల్ కలిపి తాగించడంతో వారిద్దరూ చనిపోయారని నిందితుడు పోలీసుల ఎదుట నిజాన్ని అంగీకరించాడు. ఆస్తి కోసమే అత్తమామలను చంపినట్లు గుర్తించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.