అమరావతి : ఏపీలో నెలకొన్న ఉద్యోగ ఆందోళనపై మరోసారి ఉద్యోగులు, ప్రభుత్వం కూర్చుని చర్చించుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక , కరోనా లాంటి పరిస్థితులను అర్ధం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడే ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని, పీఆర్సీపై మొదట్లో ఒకే అన్నారు. తరువాత కాదన్నారని ఆయన పేర్కొన్నారు.
కాని ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసింది అనడం సరికాదని వెల్లడించారు. తాము ప్రతి అంశాన్ని సున్నితంగానే చూస్తామని , వ్యక్తిగతంగా తీసుకుని ఏ కార్యక్రమాలు చేయబోమని స్పష్టం చేశారు. అన్ని విషయాలపై ప్రభుత్వం చర్చిస్తుంది. గాబరా ఎందుకని ప్రశ్నించారు.