హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): బాలికల సాధికారత సాధనకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని 2,775 పాఠశాలల్లో బాలికల సాధికారత క్లబ్బులను ఏర్పాటుచేసింది. ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకు నెలకొక కార్యక్రమం చొప్పున ఈ క్లబ్బుల ద్వారా నిర్వహించనున్నారు. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న శారీరక వేధింపులు, లైంగికదాడులు, బాల్యవివాహాలు వంటి సమస్యలను ఎదుర్కొనే శక్తియుక్తులను వారిలో పెంపొందించడం ఈ క్లబ్బుల లక్ష్యం.
కమిటీ స్వరూపమిలా..
ఆకతాయిలకు అడ్డుకట్ట
సమాజంలో బాలికల పట్ల కొనసాగుతున్న వివక్ష కారణంగా వారి సామర్థ్యాలు పూర్తిగా వెలుగులోకి రావడంలేదు. ఈ క్లబ్బులతో ఆకతాయిలకు ఆడ్డుకట్టపడుతుంది. బాలికలకు సురక్షితమైన వేదిక ఇది. ఈ క్లబ్బుల సహకారంతో బాలికలు ధైర్యంగా ముందడుగేయగలుగుతారు.
–రమాదేవి, హెచ్ఎం, జడ్పీహెచ్ఎస్,దేవన్నపేట, హనుమకొండ జిల్లా
బాలికల శ్రేయస్సే భవితకు మార్గం
బాలికలకు గౌరవం ఇచ్చినప్పు డు అంతటా మంచి వాతావరణం ఏర్పడుతుంది. లింగ అసమానతను రూపుమాపేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు ఈ క్లబ్బులు దోహదపడతాయి. వారిని వా రే రక్షించుకొనేందుకు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి సహాయపడతాయి. – డాక్టర్ వీ గురునాధరావు,టీచర్, మహబూబాబాద్ జిల్లా