హుజురాబాద్ రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ న్యాయం చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. మండలంలోని సిర్సపల్లి గ్రామంలో ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ఇంటింటీకీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి ఓటర్లను చైతన్యపరుచాలని అన్నారు.
సీఎం కేసీఆర్ పేదింటి బిడ్డ, యువకుడు , ఉద్యమనాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టికెట్ ఇచ్చారని యువత అంతా గెల్లు శ్రీనువాస్ వెంట ఉండి ఆయనను గెలిపించాలని అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలువాలని టీఆర్ఎస్ తోనే అభివృద్ది సాధ్యమని అన్నారు. రానున్న ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాసును భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.
టీఆర్ఎస్ ప్రజల పార్టీ అని అన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీల్, పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచడంతో సామాన్యులపై మోయలేని భారం పడిందన్నారు. పెంచిన గ్యాస్ ధరను తగ్గించకపోగా సబ్సీడీని మాత్రం తగ్గిం చి ప్రజలపై అదనపు భారం వేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.