హైదరాబాద్, సెప్టెంబర్ 24: పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు రెండు శాతం వరకు పతనమవడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రూ.50 వేల స్థాయికి పడిపోయింది. 24 క్యారెట్ల తులం ధర రూ.530 తగ్గి రూ.50,200కి చేరుకున్నది. అంతకుముందు ఈ ధర రూ.50,730 స్థాయిలో ఉన్నది. 22 క్యారెట్ల ధర రూ.500 తగ్గి రూ.46 వేల స్థాయికి తగ్గింది. అలాగే వెండి ఏకంగా రూ.1,000 తగ్గి రూ.62,500 నుంచి రూ.61,500 కు దిగింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 29.40 డాలర్లు తగ్గి 1,651.70 డాలర్లకు పడిపోగా, వెండి 18.83 వద్ద ముగిసింది.