పక్కనే గలగల పారే గోదావరి తీరం.. ఓవైపు కనుచూపుమేర పచ్చదనంతో కళకళలాడుతున్న నేల తల్లి. మరోవైపు అరటి తోటల అందాలు. పచ్చదనాన్ని
కాపాడేందుకన్నట్టుగా రోడ్డు పొడవునా సైనికుల్లా నిలిచిన తాటి చెట్లు. ఎటుచూసినా పైరగాలి. ఇదేదో కొనసీమలోని అందమనుకుంటే పొరపాటే. భద్రాద్రి
కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్దిపల్లి పంచాయతీలోని లింగాల గ్రామం. 378 ఎకరాల్లో వరి పంట ఏడాదికి రెండు సీజన్లలో సాగవుతుంది. మధ్యలో
అరటి తోట ఆకర్షిస్తుంది. 140 మంది రైతులు నిరంతరం శ్రమిస్తూ పంటలను సాగుచేస్తూ భద్రాద్రి మన్యంలో కోనసీమను గుర్తుకు తెస్తున్నారు.
– చర్ల