హైదరాబాద్ : రాష్ట్రంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఆయన మానవీయతకు నిదర్మమని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం.. రాష్ట్ర జనాభాతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు కూడా ఉచితంగా టీకా ఇవ్వాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రజల తరఫున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో కూడా రాష్ట్ర ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న కూలీలకు కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తనపెద్ద మనసును చాటుకున్నారన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు