వికారాబాద్ : క్రషర్ గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని దన్నారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ (27) టెంట్ హౌస్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. టెంట్ హౌస్ బ్లాంకెట్లు ఉతకడానికి ఎప్పటిలాగే క్రషర్ గుంతలోకి వెళ్లాడు. శ్రీనివాస్తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు.
అయితే బ్లాంకెట్లు ఉతుకుతున్న సమయంలో క్రషర్ గుంతలో శ్రీనివాస్ ఒక్కసారిగా మునిగిపోయాడు. అక్కడే ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కాగా, ఇరువురికి ఈత రాకపోవడంతో ఈ సంఘటన జరిగిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.