పెద్దపల్లి : జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతున్నది. ధర్మారం మండలం పత్తిపాక గ్రామ శివారులో బైరి వెంకన్న అనే రైతుకు చెందిన లేగదూడను గుట్టల్లోకి ఎత్తుకెళ్లి చిరుతపులి చంపేసింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలాన్ని పెద్దపల్లి డిప్యూటీ రేంజర్ స్వాతి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజవ్వ సందర్శించారు. పాదముద్రల ఆధారంగా లేగదూడను చంపింది చిరుతపులే అని నిర్ధారించినట్లు ఫారెస్టు అధికారి స్వాతి వివరాలను వెల్లడించారు.