మెట్పల్లి రూరల్ : ఆ ఊరి అన్నదాతులందరిది ఒకే మాట. ఒకే బాట. తాము అనుకున్న నిర్ణయానికి సమిష్టిగా కట్టుబడుతూ..సకాలంలో విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తూన్నారు. ఇదంతా ఒక నెలో రెండు నెలలో కాదు గత ఆరు సంవత్సరాలుగా ఈ ఆదర్శానని కొనసాగిస్తూ అభినందనలు అందుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే..జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన రైతులందరూ ఒకే రోజు వ్యవసాయ విద్యుత్ సర్వీస్ ఛార్జీలు చెల్లించారు. గత ఆరు సంవత్సరాలుగా ఒకే రోజు వ్యవసాయ విద్యుత్ సర్వీస్ ఛార్జీలు చెల్లిస్తూ మిగతా గ్రామాల అన్నదాతలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఆదివారం స్థానిక ట్రాన్స్ఫార్మర్ కమిటీ ఆధ్వర్యంలో రైతులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని, వ్యవసాయ పంపుసెట్ల సర్వీస్ ఛార్జి చెల్లించేందుకు తీర్మానం చేసుకున్నారు. 2021 సంవత్సరానికి గాను రూ. 360 చొప్పున 1032 పంపుసెట్లకు చెందిన విద్యుత్ సర్వీస్ ఛార్జి రూ. 3,71,520 చెల్లించాలని తీర్మానించుకున్నారు.
ఈ మేరకు ట్రాన్స్ కో రూరల్ ఏఈ ప్రదీప్ కుమార్కు సంబంధిత మొత్తాన్ని చెల్లించారు. ఆరేండ్ల నుంచి క్రమం తప్పకుండా ఒకేరోజు సర్వీస్ ఛార్జీలు చెల్లిస్తూ తమకు సహకరిస్తున్న రైతులకు ఈ సందర్భంగా ఏఈ కృతజ్ఞతలు తెలిపారు.