వికారాబాద్ : కుటుంబ పోషణ భారం కావడంతో భార్యతో గొడవపడి ఓ భర్త గొంతుకోసుకున్న ఘటన జిల్లాలోని పరిగి పట్టణంలో మంగళవారం జరిగింది.
కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా చిన్నదర్పల్లి గ్రామానికి చెందిన సత్యం పరిగి ప్రేమ్నగర్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో భార్యా, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.
ఆర్థిక ఇబ్బందులు అధికమవడంతో చేసిన అప్పులు తీర్చలేక భార్య లక్ష్మితో మధ్యాహ్న సమయంలో గొడవపడి కత్తితో గొంతు కోసుకున్నాడు.
విషయం గమనించిన భార్య కేకలు వేయడంతో పట్టణంలోని ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వికారాబాద్లోని మహవీర్ దవాఖానకు తరలించారు.