బేగంపేట్: మలేరియా వ్యాధి కారక మూలాలను బయటపెట్టిన గొప్ప వ్యక్తి సర్ రొనాల్డ్రోస్ అని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బేగంపేట్లోని సర్ రొనాల్డ్రోస్ ఇన్స్టిట్యూట్లో ప్రపంచ దోమలదినోత్స వం సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోనాల్డ్రోస్ పోస్టల్ కవర్ను ఆయన విడుదల చేశారు. ఈ సంధర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇదే భవనంలో అనేక పరిశోధనలు చేసి 1897 ఆగస్టు 20న మలేరియా మహామ్మారి మూలాలను రోనాల్డ్రోస్ తెలిపారని అన్నారు. రోనాల్డ్రోస్ కృషికి ఫలితంగా 1902లో నోబెల్ బహుమతి రావటం వైద్య చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిందన్నారు. మలేరియా వ్యాధి బారిన పడి చనిపోతున్న వ్యాధి గ్రస్తులను చూసి చలించిపోయిప రోనాల్డ్ రోస్ వారిని కాపాడాలనే లక్ష్యంతో అనేక పరిశోధనలు చేశారని అన్నారు.
ఈ వ్యాధి వ్యాపించడానికి ఆడ ఎనాఫిలిస్ దోమ కారణమని తెలుసుకున్న రోనాల్డ్రోస్ వాటి వృద్ధిని నివారించడానికి తగు సూచనలు చేసి మలేరియా మహమ్మారి నుంచి ఈ ప్రపంచానికి విముక్తి కలిగించారని చెప్పారు. ఈ దోమలు నిల్వ ఉన్న నీటిలో అభివృద్ధి చెంది ఒక మనిషి నుంచి మరో మనిషికి ఈ వ్యాధిని వ్యాపింపజేస్తాయని తెలిపారు. నీటిలో దోమలు లార్వా దశలో ఉన్నప్పుడు వాటి పెరుగుదలను సులువుగా నివారించవచ్చు. తద్వారా వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు. ఇంకా ప్రజల్లో దానిపై సరైన అవగాహన లేకపోవడం. కొంతమంది పారిశుద్ధ్య నిర్వహాణను పట్టించుకోకపోవడం వంటి కారణాలతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని మంత్రి విచారం వ్యక్తం చేశారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంద్వారా వ్యాధులబారిన పడకుండా కాపాడుకోవచ్చునని అన్నారు. నేటి విద్యార్ధు లకు, యువ శాస్త్రవేత్తలకు ఈ భవనానికి ఉన్న ప్రాధాన్యత, చరిత్రను తెలియజేసేలా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రవిందర్, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, ప్రొఫెసర్లు లక్ష్మీ నారాయణ, రెడ్యానాయక్, బాలకిషన్, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.