కంది/సంగారెడ్డి : భర్త చనిపోయి వేరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న కూతురు రెండో వివాహానికి అడ్డుగా ఉన్నాడని.. పసి పిల్లాడిని సొంత అమ్మమ్మనే కడతేర్చిన సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో నివాసముంటున్న కట్ట నాగమణి కి కూతురు సుజాత ఉన్నది. కాగా, సుజాతకు మధుతో వివాహం జరగగా వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకొడుకు మహేష్ (5), చిన్న కొడుకు యశ్వంత్ (2) అయితే సుజాత భర్త అయిన మధు 2 సంవత్సరం క్రితం చౌటకుర్ వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
భర్త చనిపోయిన తర్వాత సుజాత పుల్కల్ మండలానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. అక్రమ సంబంధం పెట్టుకున్న జనార్ధన్ తో వివాహం చేసుకోవాలని సుజాత కోరింది. సుజాతకు ఇద్దరు కొడుకులు ఉండగా పిల్లలు ఉంటే తనను పెళ్లి చేసుకోనని జనార్ధన్ చెప్పాడు. కాగా పెద్ద కొడుకు అయినా మహేష్ ను బంధువులు దత్తత తీసుకుంటారని చెప్పగా చిన్న కొడుకు అయిన రెండు సంవత్సరాల వయసున్న యశ్వంత్ సుజాత పెళ్లికి అడ్డుగా ఉన్నాడని భావించింది.
దీంతో సొంత అమ్మమ్మమైన నాగమణి పసివాడైన యశ్వంత్ను సంగారెడ్డి బొబ్బిలి కుంట చెరువు లో పడేసి వెళ్లిపోయింది. నీటిలో ఊపిరాడక ఆ పసికందు అక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరగగా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
మానవత్వం మంట కలిపే లా చేసిన ఈ సంఘటన చూసి చుట్టుపక్కల వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ మేరకు సంగారెడ్డి పట్టణ సీఐ రమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
డ్రైవర్ లేకుండానే నడిచిన ట్రాక్టర్.. వీడియో
విషాదం : పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
ఆ పథకాలన్నీ గత బడ్జెట్లోనివే : గుత్తా సుఖేందర్ రెడ్డి
Rashmi Gautam: లంగా ఓణీలో హీటెక్కిస్తున్న యాంకర్ రష్మీ