కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ.వి.ఎం. ల మొదటి స్థాయి (ఫస్ట్ లెవల్ చెకింగ్) తనిఖీ చేసినట్లు జిల్లా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. సోమవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ.వి.ఎం. గోడౌన్ లో గల ఈ.వి.ఎం. లను, వి.వి. ప్యాట్ లను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక త్వరలో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వివిధ రాజకీయ రాజకీయ పార్టీ ల ప్రతినిధుల సమక్షంలోఈ.వి.ఎం. లు, వి.వి. ప్యాట్ ల మొదటి స్థాయి తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ.వి.ఎం. ల మొదటి స్థాయి తనిఖీ పట్ల అన్నీ రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి , బీజెపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.