పెద్దపెల్లి : కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త రెండు రోజుల సమ్మెలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని బ్యాంకులు మూసివేశారు. బ్యాంకుల సమ్మెకు మద్దతుగా వివిధ కార్మిక సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకులు ప్రైవేటీకరించడంతో ప్రజలకు తీవ్రనష్టం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు భద్రత లోపిస్తుంది. కొత్తగా ఉద్యోగాల కల్పన ఉండదన్నారు. వెంటనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రెవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.