హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, ‘మా హైదరాబాద్’ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీధర్ ధర్మాసనం మృతి బాధాకరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వారి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రజలకు వాస్తవాలు అందించడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న జర్నలిస్టు మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. మీరంతా సురక్షితంగా ఉండాలని మంత్రి సూచించారు.
విధి నిర్వహణలో కరోనా మహమ్మారి బారిన పడి ఎందరో కలం వీరులు ప్రాణాలు కోల్పోతున్న తీరు నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. అక్షర యోధులకు జోహార్లు. విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
ఆ 8 రాష్ర్టాలు, యూటీల్లో కరోనా మరణాలు లేవు