మణికొండ: నగర శివారు మున్సిపాలిటీలను సమగ్ర అభివృద్దిలో అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో రూ.2కోట్ల 40 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు బుధవారం ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వట్టినాగులపల్లి ఒకటో వార్డులో శ్మాశానవాటిక నుంచి చెరువు కట్ట వరకు రూ.40లక్షల నిధులతో అసంపూర్తిగా ఉన్న వీడిసీసీ రహదారి పనులను ప్రారంభించారు.
రూ.50లక్షల నిధులతో నార్సింగి జిల్లా పరిషత్ పాఠశాల నుంచి మదర్డైరీ ఇండస్ట్రీస్ వరకు వీడీసీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. మరో కోటి నిధులతో మదర్డైరీ నుంచి మసీదు రోడ్డు వరకు వీడీసీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. మంచిరేవుల గ్రామ పరిధిలోని శ్రీనగర్కాలనీలో రూ.50లక్షల నిధులతో బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనేక సంక్షేమాభివృద్ది పథకాలను ప్రవేశపెట్టి అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి కృషిచేస్తుందన్నారు.
నగర శివారు మున్సిపాలిటీలను అన్నిరంగాలల్లో అభివృద్ది పర్చేందుకు పట్టణాభివృద్దిశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో చర్యలు తీసుకుంటున్నారన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ది కేవలం ఏడేళ్లకాలంలోనే జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాలకు సముచితమైన, బృహత్తరమైన పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శనీయమైన పాలనను అందిస్తు న్నారన్నారు భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగానే ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి, వైస్ చైర్మన్ జి.వెంకటేష్యాదవ్, మున్సిపల్ కమీషనర్ సత్యబాబు, కౌన్సిలర్లు యాదమ్మ, పత్తి శ్రీకాంత్,పత్తి ప్రవీణ్కుమార్, శివారెడ్డి, అమరెందర్రెడ్డి, ప్రవళికకిరణ్, నాగపూర్ణశ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.