పెద్దపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తూ..ఓ కారు లారీని ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దపల్లి మండలం రాఘవపూర్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన కారు ఎదురుగా వస్తున్నా లారీని ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ప్రణయ్ (10)అనే అబ్బాయి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.