కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన రైతు శంకర్ ఎద్దు పులి దాడిలో మృతి చెందింది. ఎద్దును ఎప్పటిలాగే శనివారం మేత కోసం స్థానిక అటవీ ప్రాంతానికి తోలుకెళ్లారు. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆదివారం నుంచి అటవీ ప్రాంతంలో వెతుకుతుండగా మంగళవారం గుట్ట చెరువు ప్రాంతంలో ఎద్దు కళేబరం కనిపించింది. ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేయగా ఎఫ్బీవో సుభాష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులిదాడిలో ఎద్దు మృతి చెందిందని ధ్రువీకరించి పంచనామా నిర్వహించారు. ఇటీవల పెద్దపులి ఇదే గ్రామంలో బాలికను పొట్టనబెట్టుకున్న విషయం విదితమే.