హైదరాబాద్ : రేవంత్రెడ్డిది ఓ డ్రామా కంపెనీ అని, జైకొట్టే వాళ్లు.. విసిల్ వేసే వాళ్లు ఆయన మనుషులే ఉంటారని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (FDC) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గజ్వెల్లో రేవంత్రెడ్డి సభ ఎనిమిది ఎకరాల్లో జరిగిందని, ఈ స్థలంలో రెండులక్షల మంది ఎలా పడుతారన్నారు. రెండులక్షల మంది రానట్లయితే పీసీసీకి రాజీనామా చేస్తావా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మిస్తున్నారని ఆరోపించారు.
తాను రేవంత్రెడ్డితో ఎనిమిదేళ్లు పని చేశానని, ఆయనది ఓ డ్రామా కంపెనీ అని విమర్శించారు. రేవంత్కు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. పథకాలపై విమర్శలు చేసే ప్రతి కాంగ్రెస్ నాయకులు సంక్షేమ పథకాలు తీసుకోవద్దన్నారు. కాంగ్రెస్కు 35వేల మంది ఉంటే.. టీఆర్ఎస్ 61లక్షల సభ్యత్వం ఉందన్నారు. గజ్వెల్ సభలో అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు భయపడే సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు.