న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ నేత శశిథరూర్ బరిలో నిలువనున్నారు. ఆయన పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను ఐదుసెట్ల నామినేషన్ పత్రాలను అందించాలని ఎన్నికల అధికారికి రాసిన లేఖలో కోరినట్లు ససమాచారం. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించడంతో ఆ పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఎన్నికలు అనివార్యమయ్యాయి.
రెండు దశాబ్దాలత తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్నికలపై వ్యాఖ్యానించడం మానుకోవాలని శశిథరూర్ ఆ పార్టీ నేత జైరాం రమేశ్కు సూచించారు. పార్టీ ఎల్లవేళలా ప్రజాస్వామ్య స్వేచ్ఛా వాక్ విలువలను తప్పక పాటించాలన్నారు. మరో వైపు జైరాం రమేశ్తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని సింఘ్వీ ట్వీట్ చేశారు.