బంజారాహిల్స్, జూన్ 25: జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక లైంగికదాడి కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సాదుద్దీన్ మాలిక్తో పాటు మరో ఐదుగురు జువైనల్ నిందితులను కస్టడీకి తీసుకుని కీలక విషయాలు సేకరించిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా శనివారం టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ) ప్రక్రియను పూర్తిచేశారు.
చంచల్గూడ జైలులో ఉన్న సాదుద్దీన్ మాలిక్తో పాటు జువైనల్హోంలో ఉన్న ఐదుగురు నిందితులను బాధితురాలి ముందు ప్రవేశపెట్టి గుర్తించగలదా లేదా అని పరిశీలించారు. ఈ ప్రక్రియలో భాగంగా నిందితులతో పాటు కొంతమందిని కలిపి నిలబెట్టిన తర్వాత బాధితురాలు వారిలో నిందితులు ఎవరనే విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను మేజిస్ట్రేట్ సమక్షంలో నిర్వహిస్తారు. ఈ టీఐపీ నివేదిక కేసులో కీలక సాక్ష్యంగా పరిగణిస్తారు.