అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు అయ్యాయి. ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. హైపవర్ కమిటీ నివేదిక తర్వాత మార్కులపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. సుప్రీం ఇచ్చిన గడువులోగా పరీక్షలు నిర్వహణ సాధ్యం కాదన్నారు. అందుకే టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇతర బోర్డులు పరీక్షలు రద్దు చేయడం వల్ల ఏపీ విద్యార్థులకు నష్టం జరగదన్నారు.