బీజింగ్ : టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం టెన్సెంట్ దశాబ్ధంలో తొలిసారిగా లేఆఫ్లను ప్రకటించింది. త్రైమాసిక రాబడి అంచనాలు అందుకోలేకపోయిన తర్వాత లేఆఫ్లపై ప్రకటన చేసింది. గత క్వార్టర్లో టెన్సెంట్ దాదాపు 5,500 మంది ఉద్యోగులను సాగనంపింది.
వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా పదేండ్లలో తొలిసారిగా చైనాలో అతిపెద్ద టెక్నాలజీ కార్పొరేషన్ టెన్సెంట్ నియామక ప్రక్రియను నిలిపివేసింది. ఇక సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సహా పలు ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు ఆర్ధిక మందగమనం కారణంగా పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
మరో చైనా టెక్ దిగ్గజం అలీబాబా ఇటీవల ఆర్దిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా దాదాపు 10,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. గత నెలలో సిలికాన్వ్యాలీలో పలు టెక్ కంపెనీలు ఏకంగా 32,000 మందిని తొలగించాయి. ట్విట్టర్, టిక్టాక్, షాపిఫై, నెట్ఫ్లిక్స్, కాయిన్బేస్ వంటి కంపెనీలు ఉద్యోగులపై వేటు వేశాయి. మరోవైపు గూగుల్, యాపిల్ తాజాగా ఉద్యోగుల తొలగింపుపై సంకేతాలు పంపాయి.