మెక్సికో సిటీ: మెక్సికోలోని జకాటికాస్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఆఫీసు ముందు నిలిచి ఉన్న ఓ కారులో పది మంది మృతదేహాలను గుర్తించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మాజ్దా ఎస్యూవీ కారులో మృతదేహాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆఫీసు ముందు కారును పార్క్ చేసిన ఇద్దర్ని అరెస్టు చేసినట్లు గవర్నర్ తెలిపారు. కారులో శవాలుగా పడి ఉన్న పది మందిని తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. మెక్సికోలో నేరాలు ఎక్కువే. ఆ దేశంలో మర్డర్లు శరవేగంగా పెరుగుతున్నాయి. జకాటికాస్ రాష్ట్రంలోనూ డ్రగ్ గ్యాంగ్ల మధ్య వార్ నడుస్తోంది.