న్యూఢిల్లీ : సివిల్స్ – 2020 ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 761 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. జనరల్ కేటగిరిలో 263 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 86 మంది, ఓబీసీ కేటగిరిలో 229, ఎస్సీ కేటగిరిలో 122, ఎస్టీ కేటగిరిలో 61 మందిని ఎంపిక చేశారు. సివిల్స్ – 2020 ఫలితాల్లో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఎంపికయ్యారు.
మొదటి ర్యాంక్ శుభం కుమార్కు రాగా, జాగృతి అవస్థికి రెండో ర్యాంకు, అంకితా జైన్కు మూడో ర్యాంకు వచ్చాయి. తెలుగు అభ్యర్థులైన పి శ్రీజకు 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడుకు 27వ ర్యాంకు, దేవగుడి మౌనికకు 75వ ర్యాంకు, రవికుమార్కు 84వ ర్యాంకు, యశ్వంత్ కుమార్ రెడ్డికి 93వ ర్యాంకు, ప్రశాంత్ సూరపాటి 498వ ర్యాంకు, తిరుపతి రావు 441వ ర్యాంకు, సౌమిత్ రాజు కే 355వ ర్యాంకు, అభిషేక్ నాయుడికి 616వ ర్యాంకు, ఈ వేగినికి 686వ ర్యాంకు, డి విజయబాబుకు 682వ ర్యాంకు, కల్లం శ్రీకాంత్ రెడ్డికి 747వ ర్యాంకు వచ్చాయి.